ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. జకార్తా నుంచి బోర్నియా ద్వీపంలోని పోంటైనాక్కు వెళ్తున్న బోయింగ్ 737-500 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో 12 మంది సిబ్బంది సహా 62 మంది ఉన్నారు. వారంతా మరణించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.36 గంటలకు టేకాఫ్ అయిన విమానం నాలుగు నిమిషాల్లోనే గల్లంతైంది. అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో థౌజండ్స్ ద్వీపాల్లో పిడుగులాంటి శబ్దంతో ఓ విమానం నీళ్లలో పడుతుండగా చూశామని అక్కడి జాలర్లు చెప్పారు.