ఐపీఎల్-2021 ముంగిట జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ మినీ ఐపీఎల్ను తలపిస్తోంది. ఐపీఎల్లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు ఆడుతున్న క్రికెటర్లలో చాలామంది ఈ టోర్నీలో భాగస్వాములు అవుతున్నారు. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రియాన్ పరాగ్, సర్ఫరాజ్ ఖాన్, కృనాల్ పాండ్య, అర్షదీప్ సింగ్ వంటి యువ కెరటాలు తమ సొంత జట్ల తరఫున పోటీ పడబోతున్నారు. సీనియర్ క్రికెటర్లైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు ప్రత్యర్థులతో తలపడబోతున్నారు.
జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరభమవుతున్న సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ స్పందించాయి.