హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ ముసుగు లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు అందిన సమాచారంతో సైఫాబాద్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించి ఆ ముఠా గుట్టు బయటపెట్టారు. ఖైరతాబాద్ పరిధిలోని ఎసీ గార్డ్స్ లో అట్లాంటిక్ హాస్పిటాలిటీ ఫిజియోథెరఫీ క్లినిక్ పేరుతో మసాజ్ సెంటర్ కొనసాగుతోంది. అయితే కొద్దిరోజులుగా అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.దీనితో గురువారం రాత్రి డీఐ రాజునాయక్ సిబ్బందితో ఆ క్లినిక్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విటులు యువతులతో పాటు నిర్వాహకురాలు మెహరాజున్నీసా ను అదుపులోకి తీసుకున్నారు. మెహరాజున్నీసా గతంలో మెహిదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసింది.